9, సెప్టెంబర్ 2023, శనివారం

సనాతన ధర్మ నిర్మూలన

గత కొన్ని రోజులుగా సనాతన ధర్మం గురించి ఒక వ్యక్తి వ్యాఖ్యనాల గురించి అనుకూల అననుకూల చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఖండిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు. కొందరు సమర్థిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇంతకుముందు చాలామంది చేసిన ఇప్పుడెందుకు ఇంత రచ్చ జరుగుతుంది. ముఖ్య కారణం అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకు, ఆ రాష్ట్రానికి మంత్రి మరియు ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి, మీడియా రేటింగ్ పెంచుకోవడానికి కల్పిస్తున్న విపరీత ప్రచారం. 


అసలు సనాతన ధర్మం ఏమిటి? ఇది తెలుసుకొనే ముందు సనాతన ధర్మ లోపాలు ఏమిటి?

 
1. అది కులాలు పుట్టించింది. వైరాలు పెంచింది.
2. అంటరానితనాన్ని పెంచి పోషించింది. - ప్రస్తుతం లేదు
3. బాల్య వివాహాలను ప్రోత్సహించింది. - ప్రస్తుతం లేదు
4. దేవదాసి,జోగిని వ్యవస్థను తీసుకు వచ్చింది. - ప్రస్తుతం లేదు
5. వితంతువులకు వివాహం వ్యతిరేకించింది. - ప్రస్తుతం లేదు
6. సతీ సహగమనం ప్రోత్సహించింది. - ప్రస్తుతం లేదు
7. శూద్రులకు వేద విద్యను వ్యతిరేకించింది.- ప్రస్తుతం లేదు
8. వరకట్నం, కన్యాశుల్కం వంటి దురాచారాలను తీసుకువచ్చింది. - ప్రస్తుతం చట్ట పరంగా నేరం
9. తలక్కారం, ముళకరం వంటి పన్నులకు కారణం అయ్యింది.  - ప్రస్తుతం లేవు.

ఇక మిగిలింది, నిర్మూలించాల్సింది కుల వ్యవస్థను.  దీనిని అందరు భావిస్తున్నట్టు సనాతన ధర్మం పుట్టించిందని అనుకున్నా ఇంకా పెంచి పోషిస్తున్నది సనాతన ధర్మమా? కాదు ప్రజలు, ప్రభుత్వాలు మరియు పార్టీలు మాత్రమే. ఈ వ్యాఖ్యలకు మూలమైన డిఎంకె వాళ్ళు వీటిని పక్కన పెట్టగలరా ? అసలు కులాల వారిగా రిజర్వేషన్లు 69 శాతానికి పెంచింది వాళ్ళే కదా. కులాలు పుట్టింది వారు చేసే పనిని బట్టి కాని జన్మననుసరించి కాదు.  మరి అన్ని కులాల వాళ్ళు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఇంకా కులమనే పదం మనకు అవసరమా? అది కదా అసలు నిర్ములించాల్సింది. భారత దేశం నుంచి వెలివేయాల్సింది కులాన్నికానీ సనాతన ధర్మాన్ని కాదు. అది ఏ పార్టీ చేసిన దానిని స్వాగతించాల్సిందే,కానీ ఎవ్వరు దాని జోలికి పోలేరు, వెళితే ఆ పార్టీల మనుగడే ఉండదు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేయరు. నాకు కులం వద్దని ప్రజలు బలంగా కోరుకున్నప్పుడు కుల వ్యవస్థ పోతుంది, కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తే కాదు. ఎందుకంటే ధర్మం అనేది కులమతాలకు అతీతమైనది. అది భారతీయుల జీవన విధానం. అది వసుధైక కుటుంబాన్ని కోరుకున్నది, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్నది. ప్రకృతితో మమేకమై జీవించడం నేర్పింది. అన్నిటా దేవుణ్ణి దర్శించటం నేర్పింది.  దీనికి వ్యతిరేకంగా వచ్చిన ఆచారాలు, వ్యవహారాలు ఏవైనా వస్తే అవి కొందరు పాలకుల పైత్యం వల్ల, అప్పటి పరిస్థుతుల వల్ల, అవిద్య, అజ్ఞానం ద్వారా వచ్చాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...