23, మార్చి 2024, శనివారం

అమరవీరుల దినోత్సవం



విప్లవ శంఖం పూరించిరదిగో త్రిమూర్తులు
రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవులు.  
లాలాజీ రక్తాన్ని రుచి చూసిన శాండర్సు,
గుంటనక్క వేటాడగా సింహాలై గర్జించిరదిగో

బెబ్బులులై ముందుకురికి, మట్టుబెట్టి,
పంజాబు కేసరికి ఘన నివాళి ఘటియించే   
శాండర్సు రక్తము తోడ తర్పణాలు వదిలి,
జనులందరు ముదముతోడ హర్షించే.

ఉరికైనా వెరువక ముందుకు సాగిరి,
స్వాతంత్ర్య సమరాన అమరపురికేగిరి.  
వారు పూరించిన విప్లవ శంఖపు ధ్వని
ప్రతిధ్వనిస్తూనే ఉన్నది, నేటికీ ఈనాటికి.

ధన్యురాలివమ్మ నవభారత జనని,
నీ బిడ్డల తెగువ స్ఫూర్తినింపే భరత భూమికి.

అమరవీరుల దినోత్సవ సందర్భముగా
-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.

 పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...