విప్లవ శంఖం పూరించిరదిగో త్రిమూర్తులు
రాజ్ గురు, భగత్ సింగ్, సుఖదేవులు.
లాలాజీ రక్తాన్ని రుచి చూసిన శాండర్సు,
గుంటనక్క వేటాడగా సింహాలై గర్జించిరదిగో
బెబ్బులులై ముందుకురికి, మట్టుబెట్టి,
పంజాబు కేసరికి ఘన నివాళి ఘటియించే
శాండర్సు రక్తము తోడ తర్పణాలు వదిలి,
జనులందరు ముదముతోడ హర్షించే.
ఉరికైనా వెరువక ముందుకు సాగిరి,
స్వాతంత్ర్య సమరాన అమరపురికేగిరి.
వారు పూరించిన విప్లవ శంఖపు ధ్వని
ప్రతిధ్వనిస్తూనే ఉన్నది, నేటికీ ఈనాటికి.
ధన్యురాలివమ్మ నవభారత జనని,
నీ బిడ్డల తెగువ స్ఫూర్తినింపే భరత భూమికి.
అమరవీరుల దినోత్సవ సందర్భముగా
-శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
23, మార్చి 2024, శనివారం
అమరవీరుల దినోత్సవం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఓటు నా చేతిలో… అధికారం మాత్రం వారి చేతిలో!
ఓటు వేసేది నేనే… పన్ను కట్టేది నేనే… ఆట ఆడేది మాత్రం వారే! కోట కట్టేది మాత్రం వారే! అరాచక చదరంగంలో, రాజు ప్రజలే అయినా… మంత్రుల చేతిలోనే అధిక...
-
ఆకృతినీయుడు అవని మట్టితో, అలంకరించుడు ఓషధీయ పత్రితో, పూజచేయుడు నిజగృహ పూలతో, నివేదించుడు ముదమున మోదకములతో, నిమజ్జనచేయుడు విగ్రహము నీటితో, గ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
రోగ కారణానికి కాకుండా , రోగ లక్షణాలకు వైద్యం చేస్తే రోగం నయం కాదు. - శివ భరద్వాజ్ మనం శారీరకంగా కాదు, మానసికంగా లేదా ఆత్మీయంగా ఎదుర్కొనే సమ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి