20, సెప్టెంబర్ 2023, బుధవారం

కుత్సితమున కోట్లు కూడబెట్టినను - ఉత్సుకతన ఒక్కనోటును రాదు

కుత్సితమున కోట్లు కూడబెట్టినను
ఉత్సుకతన ఒక్కనోటును  రాదు
ధర్మముగా పది వందలు పొంది
ధర్మము చేసిన పది రూప్యములును
ధర్మము నీ వెంటవచ్చు తోడుగను
ధర్మపరుడను కితాబు మిగులును

భావం:
చెడు మార్గాల ద్వారా కోట్లు కూడబెట్టినా కూడా నీవు చనిపోయినప్పుడు ఉత్సాహంగా నీవెంట ఒక్క నోటు కూడా రాదు. కానీ ధర్మ మార్గముల ద్వారా పది వందలు సంపాదించి, అందులోనుంచి పది రూపాయలు దానం చేస్తే, ఆ ధర్మం నీవు చనిపోయాక కూడా నీ తోడు వస్తుంది. పైగా ధర్మ పరుడని అందరు నిన్ను గుర్తుంచుకుంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రథ సప్తమి ప్రాముఖ్యత - ఏడు సంఖ్య రహస్యం - భీష్ముడి 7 అవయవాలు - ఆరోగ్యం & ధర్మం

🌞 రథ సప్తమి ప్రాముఖ్యత మన భారతీయ సంప్రదాయంలో పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు — అవి మన జీవన విధానాన్ని శుద్ధి చేసే మార్గదర్శకాలు. అట...