20, సెప్టెంబర్ 2023, బుధవారం

కుత్సితమున కోట్లు కూడబెట్టినను - ఉత్సుకతన ఒక్కనోటును రాదు

కుత్సితమున కోట్లు కూడబెట్టినను
ఉత్సుకతన ఒక్కనోటును  రాదు
ధర్మముగా పది వందలు పొంది
ధర్మము చేసిన పది రూప్యములును
ధర్మము నీ వెంటవచ్చు తోడుగను
ధర్మపరుడను కితాబు మిగులును

భావం:
చెడు మార్గాల ద్వారా కోట్లు కూడబెట్టినా కూడా నీవు చనిపోయినప్పుడు ఉత్సాహంగా నీవెంట ఒక్క నోటు కూడా రాదు. కానీ ధర్మ మార్గముల ద్వారా పది వందలు సంపాదించి, అందులోనుంచి పది రూపాయలు దానం చేస్తే, ఆ ధర్మం నీవు చనిపోయాక కూడా నీ తోడు వస్తుంది. పైగా ధర్మ పరుడని అందరు నిన్ను గుర్తుంచుకుంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

భారతీయ మహిళ ఔన్నత్యం

 నిజంగా లోతైన ఆలోచన కలిగించే వ్యాసం👇 🌼 మహిళల తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రయత్నించారా? 🌼  మనం తరచుగా తెలివి...