20, సెప్టెంబర్ 2023, బుధవారం

కుత్సితమున కోట్లు కూడబెట్టినను - ఉత్సుకతన ఒక్కనోటును రాదు

కుత్సితమున కోట్లు కూడబెట్టినను
ఉత్సుకతన ఒక్కనోటును  రాదు
ధర్మముగా పది వందలు పొంది
ధర్మము చేసిన పది రూప్యములును
ధర్మము నీ వెంటవచ్చు తోడుగను
ధర్మపరుడను కితాబు మిగులును

భావం:
చెడు మార్గాల ద్వారా కోట్లు కూడబెట్టినా కూడా నీవు చనిపోయినప్పుడు ఉత్సాహంగా నీవెంట ఒక్క నోటు కూడా రాదు. కానీ ధర్మ మార్గముల ద్వారా పది వందలు సంపాదించి, అందులోనుంచి పది రూపాయలు దానం చేస్తే, ఆ ధర్మం నీవు చనిపోయాక కూడా నీ తోడు వస్తుంది. పైగా ధర్మ పరుడని అందరు నిన్ను గుర్తుంచుకుంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్త తేజమును పొంది గెలవగ తిరిగి రండి

 సీస పద్యం: ఫలితము లొచ్చెను,  పిల్లల రాతకు, వివరము తెలిసెను, విజయములను పొందిన వారి, విశ్రాంతి నందిన వారి, చింత వలదు  ఫలితంబు గూర్చి, వదలి పె...